CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన బాలిక చైత్ర పై అత్యాచారం చేసి చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి‌ ఎస్ఎఫ్ఐ డిమాండ్ ...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆరేళ్ల గిరిజన బాలిక చైత్ర ను హైదరాబాదులోని సింగరేణి కాలనీ లో అత్యాచారం చేసి ఆ బాలికను చంపేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి వీరభద్రం డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం మాట్లాడుతూ.. దేశంలో మరియు రాష్ట్రంలో ఇలాంటి అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం ప్రభుత్వాలేని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి వాటిపై స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ సహాయం కింద 50 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూం ఇల్లు, మరియు వారి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు వెంటనే అమలు చేయాలని అన్నారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు గార్లపాటి పవన్ కుమార్, బోడ అభిమిత్ర, నాయకులు పవన్, యశ్వంత్, సుమంత్, చరణ్, పృద్వి, వికాస్, చందు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: