మన్యం టీవీ మంగపేట.
అభం శుభం తెలియని ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు ఎంత గొప్ప వారైనా వదలోద్దని వెంటనే వారిని పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని రాజుపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందు గా అంబేద్కర్ విగ్రహం ముందు యువత చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అనంతరం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో యువత అంబేద్కర్ సెంటర్ నుండి రాజుపేట ప్రధాన వీధులలో చైత్రకు న్యాయం చేయాలి అంటూ నినదించారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ సంఘం నాయకులు కర్రీ రామ్మోహన్, జూపూడి సుబ్బారావు, బుక్యా దొరబాబు జోగారావు, బోడ ప్రవీణ్ విద్యార్థి నాయకులు జానపట్ల నవీన్, కర్రీ చంద్రశేఖర ఆజాద్,ఎర్రం శంకర్,విద్యార్థులు సన్నీ, అఖిల్, చరణ్ చిన్ని, స్ఫూర్తి, లహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: