మణుగూరు మండల వ్యాప్తంగా విప్ రేగా విస్తృత పర్యటన
పలువురు టిఆర్ఎస్ నాయకులు,మహిళ కార్యకర్తలను పరామర్శించిన విప్ రేగా
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం మరియు పట్టణ పరిధిలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యం తో బాధపడుతున్న పలువురు టీఆర్ఎస్ నాయకులను,మహిళా కార్యకర్తలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అండగా ఉంటానని ఎవరూ అధైర్య పడవద్దని అని వారికి భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్,నాయకులు,మహిళ,కార్యకర్తలు,యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: