మన్యం టీవీ; ములకలపల్లి మండలం:
గంప దమయంతి అనే 58 సంవత్సరాల అనాధ మహిళ మాదారం గ్రామంలో నివసిస్తూన్నారు. ఆమె క్షయవ్యాధితో బాధపడుతుంది, ఆమెకు నిలువ నీడ ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అప్పీల్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోళ్ల రమేష్ ఐదు వేయిలు,సంస్థ ఉపాధ్యక్షుడు కే మధుబాబు నాలుగు వేయిలు,సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భానోత్ రామారావు వెయ్యి రూపాయలు,చొప్పున మొత్తం పది వేల రూపాయలు వారు అందజేసారు. భవిష్యత్తులో అవసరమైతే ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులను,ఆహారాన్ని కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారూ.ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్న మాదారం గ్రామ సర్పంచ్ వాడే నాగరాజు,ములకలపల్లి ఎంపిపి మట్ల నాగమణి,టిఆర్ఎస్ పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,సీతయ్య గూడెం గ్రామ సర్పంచ్ కారం సుధీర్,మాదారం టి.ఆర్.ఎస్.గ్రామ అధ్యక్షుడు ముదిగొండ గోపి,టిఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు మిరియాల మధు,గ్రామ బీసీ సంఘం అధ్యక్షు లు బొమ్మగాని వెంకన్న, గ్రామ పెద్దలు వాడే నరసింహారావు,జయసూర్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: