👉 జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 16, మండల పరిధిలోని పడమట నర్సాపురం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, వినోభానగర్ ప్రాధమికోన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడవద్దని, బ్లాక్ బోర్డులను ఉపయోగించాలని,
విద్యార్థులకు సరళీకృత విద్యా బోధన చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు
చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులు అందరూ విధిగా
సమయపాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
Post A Comment: