మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 16, పడమట నర్సాపురం గ్రామానికి చెందిన మరకల నర్సిరెడ్డి (58) అనే వ్యక్తి గత మూడు నెలలుగా మతిస్థిమితం కోల్పోయి అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నాడని, ఈ క్రమంలో ది :11-9 -2021 మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోగా వారి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఎటువంటి సమాచారం దొరకలేదని, గురువారం ఉదయం 10 గంటలకు నర్సాపురం గ్రామానికి చెందిన బచ్చల సారయ్య అను వ్యక్తి గ్రామ శివారులో గల గోపాల కుంట చెరువు లో చనిపోయి ఉన్న నర్సిరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, కుటుంబ సభ్యులు వచ్చి గుర్తించి మతి స్థిమితం లేక గోపాల కుంట చెరువు లో ప్రమాదవశాత్తు పడి చనిపోయి ఉంటాడని, అతని మృతి మీద ఎటువంటి అనుమానం లేదని మృతుడి భార్య మరకల విజయ దరఖాస్తు ఇవ్వగా ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: