👉 భౌతిక దేహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాములు నాయక్..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 16, మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన గ్రామ పెద్ద, కాంగ్రెస్ పార్టీ నేత, డీసీసీబీ మాజీ డైరెక్టర్ అల్లడి రంగయ్య గురువారం నాడు అనారోగ్యం కారణంగా వారి ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు. వారి భౌతిక దేహాన్ని వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్ సందర్శించి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఇతర సంఘాల నాయకులు, అభిమానులు, మిత్రులు,వారి అంతిమ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: