CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోట్లపల్లి లో పోషన్ మా కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ సర్పంచ్ తోలెం కళ్యాణి

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని 

పోట్ల పల్లి క్లస్టర్ లో గల పోట్ల పల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త తోలెం సరోజినీ ఆధ్వర్యంలో పోషణ్ మా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీ సర్పంచ్ తోలెం కళ్యాణి, ప్రత్యేక అధికారి ప్రసాద్ లు రావడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు వారికి సాగర స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ తో కలిసి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కళ్యాణి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని, అప్పుడే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా జన్మిస్తారు అని తెలియజేశారు.చిన్న పిల్లలకు కూడా ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వివో సంగీత, అంగన్వాడీ కార్యకర్తలు సురంజనమ్మ, రమాదేవి, శాంతి ప్రియ, పుల్లమ్మ, ఆశాలు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: