మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉద్యోగంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ డ్యూటీ నిర్వహిస్తున్న అంగన్ వాడీ టీచర్ స్థానిక సర్పంచ్ దాడి చేయడం హేయమైన చర్యని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని సిఐటియు జిల్లా నాయకులు ఈసం వెంకటమ్మ, ఆలేటి కిరణ్ పేర్కొన్నారు. ఓవైపు ఉద్యోగ భద్రత కావాలని,కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే మహబూబాద్ జిల్లా లో మాదాపురం సర్పంచ్ .అంగన్ వాడీ కార్యకర్త అయిన తేజావత్ కమల అక్రమ దాడి చేయడం సరికాదన్నారు.ప్రభుత్వం, అధికారులు పని వత్తిడి పెంచుతూ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటే వాటిని అధిగమించి రాత్రనకా పగలనకా ఉద్యోగం చేస్తున్నారు. కానీ స్థానిక రాజకీయ నాయకులు ప్రభుత్వ అండదండలతో వారు చెప్పింది వినాలని లేకుంటే ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉన్నప్పటికీ పోలీసులు అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అక్రమంగా దాడి చేసిన సర్పంచ్ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల సి ఐ టి యు ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులగూడెం సర్కిల్, స్టేషన్ బస్తి సెక్టార్ ఇల్లందులో పాడు సర్కిల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సి ఐ టి యు ఫాతిమా, కల్లేపల్లి మరియ,రమని,శకుంతల, ఆలేటి సంధ్య, వనజ,దేవేంద్ర, శారద,ఆదిలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: