మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ తడి చెత్త పొడి చెత్త పై 14వ వార్డు అవగాహన ర్యాలీ నిర్వహించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మరియు కమిషనర్ అంజన్ కుమార్ అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. . సామాజిక బాధ్యత గా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి పురపాలక సంఘం వారి స్వచ్ఛ ట్రాలీకి విధిగా అమలు చేయాల్సిందిగా కోరారు. తడి పొడి చెత్తను వేరు చేయాలని వారి ఇంటి నుండి చెత్తను స్వీకరించ వద్దు అన్నారు. చెత్త బయట వేస్తే వారిపై కఠిన చర్యలు తో పాటు భారీ జరిమానాలు ఇస్తామని హెచ్చరించారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇల్లందు మున్సిపాలిటీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ నంద బిందు ప్రవీణ్, ఇల్లందు మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు, ఇల్లందు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ ఎలమందుల వాసు, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పాష, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, జవాన్ అంజాద్, లక్ష్మణ్ మున్సిపల్ కార్మికులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: