మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్సెలెంట్ స్కూల్ విద్యార్థి జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో విజయం సాధించాడు. జూలూరుపాడు గ్రామానికి చెందిన కొల్లిపాక సురేష్ కుమారుడు కొల్లిపాక హర్షవర్ధన్ జోహార్ నవోదయ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో ఉన్న జవహర్ నవోదయ కళాశాల నందు ఆరవ తరగతి సీటును సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల తాహశీల్దార్ లూధర్ విల్సన్ విజయం సాధించిన హర్షవర్ధన్ ను అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. అదే విధంగా సాయి ఎక్సెలెంట్ స్కూల్ కరస్పాండెంట్ అరెబోయిన కృష్ణ ప్రసాద్ విద్యార్థి హర్షవర్ధన్ ను అభినందించారు. మండలం లోని ప్రతి పేద విద్యార్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల విద్యాలయాలకు, నవోదయ విద్యాలయాలకు, సైనిక్ విద్యాలయాలకు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించిన పోటీ పరీక్షలలో నాణ్యమైన విద్యను బోధించి ప్రతి పేద విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే విధంగా సాయి ఎక్సెలెంట్ స్కూల్ ముందంజలో ఉంటుందని తెలిపారు. అదే విధంగా విద్యార్థి తండ్రి కొల్లిపాక సురేష్ మాట్లాడుతూ.. మా అబ్బాయికి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష కు విజయం సాధించే విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
Post A Comment: