బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్
అశ్వాపురం: బహుజన్ సమాజ్ పార్టీ అశ్వాపురం మండల అధ్యక్షులుగా భగవతపు సతీష్ యాదవ్ ను నియమిస్తూ బుధవారం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ నియమకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించి సెక్టార్,బూతు స్థాయి నుండి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి ప్రజలను సమన్వయం చేస్తూ పోరాటాలు చేస్తామని తెలిపారు,అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడుగా మాచినటి రంగబాబు,ప్రధాన కార్యదర్శిగా రమేష్,యూత్ అధ్యక్షులుగా జెర్పుల నవీన్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు *యెర్రా.కామేష్* గారికి ధన్యవాదాలు తెలిపారు
Post A Comment: