రోగికి తప్పిన ప్రమాదం...
ఖమ్మంలోని వైరా రోడ్డు లో గల ప్రశాంతి హాస్పిటల్ మొదటి ఫ్లోర్ లో ఉన్న గదిలో పైకప్పు సీలింగ్ ఉడిపడటంతో అక్కడే చికిత్స పొందుతున్న రోగి, ఆమె కుమారుడుకు పెనుప్రమాదం తప్పిందని సమాచారం.
వివరాల ప్రకారం మహబూబాద్ జిల్లా కేంద్రం నుంచి డయాబెటిక్, లివర్ సంబంధిత జబ్బుతో *జిలేహా* అనే మహిళ బాధపడుతూ ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం హాస్పిటల్ లో చికిత్సపొందుతోంది.ఆమెతో వచ్చిన కుమారుడు ముజ్జు పై ఒక్కసారిగా పై సీలింగ్ కుప్పకూలి పడటంతో మహిళ తల భాగం న, చేయి కి బలమైన గాయం తగలడంతో హాస్పిటల్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి స్కానింగ్ నిమిత్తం తీసుకెళ్లినట్లు సమాచారం.
సంబంధిత అధికారులు మౌలిక సదుపాయాలు కలిపించని హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Post A Comment: