👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
మన్యం టీవి, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా
రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పాడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కోరారు.
భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలలోని అన్ని మండలాల లోని ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండి కల్వర్టులు, రోడ్ల పరిస్థితి ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని, చెరువులు, జలాశయాలు, నీటి మట్టాల ను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జరిగింది.
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు ఆదేశించారు.
అదే విధంగా మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని వారు సూచించడం జరిగింది.
Post A Comment: