CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెరువుల్లో చేప పిల్లలను వదిలిన ఎంపీటీసీ నారం నాగమణి, ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు..

Share it:

 


 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామ పంచాయతీ చెరువులో సర్పంచ్ సున్నం సరస్వతి అద్వర్యం లో సోమవారం ఎంపీటీసీ నారం నాగమణి, ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు తిరుమలకుంట ముత్యాలమ్మ చెరువు, పాకలగూడెం, తొగ్గూడెం చెరువులలో 112,000 చేప పిల్లలను వదిలారు. వారు మాట్లాడుతూ చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సున్నం రామలక్మయ్య, సెక్రెటరీ రమేష్ నాయక్, శ్రీను, సత్యనారాయణ, పంచాయతీ సిబ్బంది వెంకన్నబాబు, బాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: