మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కౌలూరు అంజు గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.అట్టి విషయం స్థానిక టిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బూర్గంపాడు జడ్పీటీసి కామిరెడ్డి శ్రీలత వారి నివాసానికి వెళ్లి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, PACS వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి,స్థానిక ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీ లక్ష్మీ ,స్థానిక మాజీ ఎంపీటీసీ భూక్య రాందాస్, బూర్గంపాడు మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు,స్థానిక వార్డుసభ్యులు మేడగం శ్రీనివాస రెడ్డి,మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి,స్థానిక టిఆర్ఎస్ నాయకులు బిజ్జం వెంకట్రామిరెడ్డి,యడమకంటి సుధాకర్ రెడ్డి,యడమకంటి రోశిరెడ్డి,పాలం లక్ష్మీరెడ్డి, పిచ్చిరెడ్డి,సాలయ్య,రాంబాబు గారు,బెల్లంకొండ రామారావు, తెలంగాణ ఉద్యమకారులు పోడియం నరేందర్ స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: