మన్యం టీవీ మణుగూరు: చిట్యాల రజక కుటుంబంలో పుట్టిన,దొరలను రజాకార్లను సైతం ఎదిరించి భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, *పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు* అని తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతిని,వర్ధంతి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నారని జీవో జారీ చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తూ,మణుగూరు లోని చాకలి ఐలమ్మ నగర్ లో గల ఐలమ్మ స్థూపం వద్ద రజకులందరూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఐలమ్మ నగర అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ 18 రాష్ట్రాలలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారు అని, వెంటనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని సూచించారు. అలానే వెంటనే రజకులకు రజక బంధుని ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాపర్తి శ్రీహరి, కుమ్మరి కుంట్ల సుధాకర్. గుంటుపల్లి నరసింహారావు. ముత్యాల బాలరాజు. ఓరుగంటి సోమేశ్. తెలగరపు.నరసింహా రావు, కొమరగిరి రమేష్,రేమల్ల రాంబాబు.ఓరుగంటి బిక్షపతి,రాపర్తి వెంకటమ్మ, సరిత,పద్మ,రజిత,కృష్ణవేణి,ప్రమీల.సరూప.రేణుక.లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: