ఏడు రోజులు సెలవులు ప్రకటించిన ఎం ఈ ఓ
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని తోగ్గూడెం పంచాయతీకి చెందిన గోవిందాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునికి కరోనా వ్యాధి సోకింది. పాఠశాల ప్రారంభమై రెండు రోజులు కాకముందే ఉపాధ్యాయునికి కరోనా వ్యాధి సోకడంతో, పినపాక మండల విద్యాధికారి వీరస్వామి ప్రాథమిక పాఠశాలకు ఏడు రోజులు సెలవు ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఎంఈవో ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది
Post A Comment: