*కాకుల మర్రి నరసింహారావు (లక్ష్మణ్ బాబు).
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని 13వ వార్డు కు చెందిన రెడ్డి నర్సింగరావు ఆరోగ్యం బాగోలేక పక్షవాతం వచ్చి భద్రాచలం హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.అక్కడి డాక్టర్లు అతన్ని పరీక్షించి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తెలపడంతో రెడ్డి నర్సింగరావు కుటుంబ సభ్యులు ములుగు జిల్లా సీనియర్ నాయకులు కాకుల మర్రి లక్ష్మి నర్సింహా రావు (లక్ష్మణ్ బాబు)కు తెలపడంతో వెంటనే స్పందించిన లక్ష్మణ్ బాబు భద్రాచలం హాస్పిటల్ నుండి ప్రైవేటు వాహనాన్ని మాట్లాడి హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ లో చేర్పించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ల తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. లక్ష్మణ్ బాబు మానవత్వాన్ని ములుగు జిల్లా ప్రజలతోపాటు ఏటూరు నాగారం మండలం లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: