మండలంలోని మూడు గ్రామపంచాయతి లోని గ్రామలను సందర్శించి నేరుగా సమస్యలను తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ కరకగూడెం: మండలరిదిలోని తుమ్మలగూడెం గ్రామంలోని గండిచెరువు గత సంవత్సరం కురిసిన భారీ వర్షల కారణంగా చెరువు గండి పడటంతో తుమ్మగూడెం గ్రామపంచాయతి సర్పంచ్ తోలెం సావిత్రి, రైతులు ప్రభుత్వ విప్ రేగా దృష్టికి తిసుకెళ్ళడంతో గండి చెరుని పరిశిలించాడానికి సూమరు మూడు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్ళి గండిచెరుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు మరమత్తులకు ఎంత ఖర్చు వస్తుందో ఇరిగేషన్ ఏఈ సక్రు నాయక్ ని అడిగి తెలుసుకోని రైతులతో మాట్లాడారు.అనంతవరం తమ్మలగూడెం,అనంతారం, పద్మపూరం గ్రామపంచాయతి ప్రజలతో మాట్లడి నేరుగా ప్రజ సమస్యలను అడిగి తెలుసుకోని వారు చెప్పిన సమస్యలను సంబందిత అధికారులు చెరవాణిలో సమస్యలను వివరించి కొన్ని వెంటనే పరిష్కరించారు. మరికోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ సక్రు నాయక్, జడ్పిటిసి కొమరం కాంతారావు ఎంపీపీ రేగా కాళికా, స్థానిక సర్పంచ్ లు తోలెం సావిత్రి, బత్తిని నర్సిహరావు, తాటి సరోజినీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ నాయకులు అత్తె నాగేశ్వరరావు, బుడగం రాము, కొంపెల్లి.రామలింగం, మల్కం వెంకటేశ్వర్లు, నిట్ట ఏడుకొండలు, తొలెం నారాయణ, యువజన నాయకులు నిట్టా ప్రభాకర్ ,రాంబాబు ఈసం రాజబాబు,కొమరం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: