CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ పత్రికను స్పీకరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా పౌండేషన్ అధ్యక్షురాలు మరియు ఎంపిటిసి వేముల భారతి

Share it:

 



 మన్యంటీవీ, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా పౌండేషన్ అధ్యక్షురాలు మరియు అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతి అశ్వరావుపేట మన్యం మనుగడ ప్రతినిధి దాది చంటి ద్వారా మన్యం మనుగడ మాసపత్రికను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వేముల భారతి మాట్లాడుతూ ఆదివాసీ తెగలలో చైతన్య నింపడమే లక్ష్యంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీసుకువచ్చిన మన్యం మనుగడ మాస పత్రిక అద్భుతమని కితాబు ఇచ్చారు. ఆదివాసీలకు చట్టాలపై అవగాహన కలిగించేందుకు, విద్యాపరంగా ముందడుగు వేసేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పథకాలు సామాజికంగా, ఆర్థికంగా మరింత మెరుగు పరచాలన్న మహోన్నత లక్ష్యంతో ఈ పత్రిక తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆదివాసీల కోసం మన్యం మనుగడ మాసపత్రికను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రయత్నం అద్భుతం అన్నారు. ఈ సందర్భంగా మన్యం మీడియా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

Post A Comment: