- ప్రభుత్వ కళాశాల ప్రహరీ గోడకు నిధులు మంజూరు
- అడిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ వి ప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
- తక్షణమే సి డి పి నిధుల నుండి 14 లక్షలు విడుదల
గుండాల సెప్టెంబర్ 14 (మన్యం టీవీ) గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడకు నిధులు మంజూరయ్యాయి. మంగళవారం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ నవీన జ్యోతి మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి కళాశాల సమస్యలు వివరించి ప్రహరీ గోడ మంజూరు చేయాలని ఆమె విన్నవించుకున్నారు. తక్షణమే స్పందించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు రేగా కాంతారావు సి డి పి నిధుల నుండి 14 లక్షల రూపాయలను తక్షణమే విడుదల చేశారు. మారుమూల మండలమైన గుండాల మండలం పై రేగా కాంతారావు కున్న శ్రద్ధ ఎంతో ఈ ఘటన సరిపోతుంది. కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఎమ్మెల్యే అంటే ప్రజల సమస్యలను తక్షణమే తీర్చే విధంగా ఉండాలని అన్నారు. ఆ లక్షణాలన్నీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు లో మెండుగా కనిపిస్తున్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. దీనితోపాటు ఐ టి డి ఎ పి ఓ గౌతమ్ ను కలవగా కళాశాలకు ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ ను మంజూరు చేశారు. నూతన ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన నవీన జ్యోతి తక్కువ కాలంలోనే కళాశాలను చక్కబెట్టే ప్రణాళికలు రూపొందించి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, చైతన్య పాల్గొన్నారు
Post A Comment: