మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చెరువు పై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్ మరియు మున్సిపల్ అధికారులను అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకుని,తగిన సూచనలు చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్, అధికారులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: