ఆరేళ్ల గిరిజన చిన్నారి చైత్రకు నివాళిగా మణుగూరు సింగరేణి ఎస్ సి. ఎస్ టి వెల్ఫేర్ అసోసియేషన్, భరోసా వెల్ఫేర్ సొసైటీ మరియు సింగరేణి ముస్లిం వెల్ఫేరే అసోసియేషన్ ఆధ్వర్యంలో మణుగూరు సింగరేణి పీవీ కాలనీ ఏరియా సి. ఈ ఆర్ క్లబ్ నుండి డాక్టర్ అంబెడ్కర్ పార్క్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిబిజికేయస్ నాయకులు వీర భద్రయ్య,ఎస్. సి ఎస్. టి వెల్ఫేర్ నాయకులు కోట శ్రీనివాసరావు,అంథొటి నాగేశ్వరరావు, సంజీవ రావు, అబ్దుల్ రవూఫ్, హాబీబ్, నాజర్ పాషా,అమినుద్దీన్,పివి కాలనీ వార్డ్ మెంబర్స్ కలగూర. శంకర్,జ్యోతి, షాకిరా బేగం, రమాదేవి,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: