మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని చిన్నబోయినపల్లి,షాపల్లి మధ్య ఉన్న వట్టి వాగు ను శనివారం ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ పరిశీలించారు. ప్రజల రాకపోకలు ఇబ్బందుల దృష్ట్యా భారీ వర్షాలకు వరదలకు బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోయిన నేపథ్యంలో తాత్కాలికంగా నిర్మించిన డైవర్షన్ రోడ్డు వరదలకు కొట్టుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టడం కోసం కృషి చేస్తానని అన్నారు.
Post A Comment: