CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ సాయుధ పోరాట పూర్తి తో సమస్యలపై ఉద్యమించాలి -సిపిఐ యార్లగడ్డ భాస్కరరావు

Share it:

 



 మన్యంటీవి, దమ్మపేట: తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజుని పురస్కరించుకొని ఈరోజు దమ్మపేట సిపిఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 11 1947 లో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి  కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి కామ్రేడ్ మఖ్దూమ్ మొహియుద్దీన్లు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు నిజాం తాబేదార్లు, జాగీర్దార్లు, జమీందారులు, దొరలు, దేశ్ముఖ్లు భూస్వాములు పెట్టుబడిదారులు విచ్చలవిడిగా దోపిడీతో దౌర్జన్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సమర శంఖం పూరించి సుమారు నాలుగువేల ఆరువందలమందివారి ప్రాణాలను పణంగా పెట్టి నిజాం రాజును గద్దెదించి తెలంగాణను భారత్ యూనియన్లో విలీనం చేశారు. నాటి కమ్యూనిస్టు నాయకులు పోరాట ఫలితాలుగా పది లక్షల ఎకరాలను పేదలకు పంచడం జరిగిందని కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని ప్రజలు స్వేచ్ఛగా వారి జీవనాన్ని కొనసాగించే లాగా కమ్యూనిస్టు పార్టీ ప్రజల తరఫున నిలబడిందని అయన అన్నారు. ఆ రోజుని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 11 2021 సిపిఐ పార్టీ  ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించుకుంటూ ఈరోజు దమ్మపేట లో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ జెండా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పండూరివీరబాబు, మండల కార్యదర్శి తంగెళ్ల ముడీ శివ కృష్ణ, మహిళా సంఘ జిల్లా నాయకురాలు యండమూరి రత్నకుమారి, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ధర్మ, గిరిజన నాయకుడు సత్యం ఏఐటీయూసీ నాయకులు గొర్రెపాటి బసవయ్య, శేషు కుమారి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: