మణుగూరు ఏరియా లో కరోనా ప్రళయ తాండవం చేస్తున్న సమయంలో మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్గ్ గారు ప్రత్యేక దృష్టి నడుమ కరోనా సోకిన వారికి మణుగూరు సింగరేణి వైద్యశాలలో అందించిన వైద్య సేవలు ఏనాటికి మరువలేనివని మణుగూరు ఏరియా న్యాయవాది కిషన్ తెలిపారు. కరోనా సోకి తన మాతృమూర్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు గారి ఇచ్చిన సూచన మేరకు మణుగూరు సింగరేణి వైద్య శాలకు తీసుకరావడం జరిగిందనిస్థానిక యాజమాన్య పనితీరు వైద్యులు,టిబిజికేయస్ చూపిన ప్రత్యేక చొరవ తో తన తల్లి నిండైన ప్రాణాలు దక్కయని తెలిపారు.తన మాతృమూర్తి కి మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ గారికి లాయర్ కిషన్ శాలువతో సన్మానం చేసి హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఇరువురి కి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏజియం సివిల్ వెంకటేశ్వర్లు, టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు గారు లెవెన్ మెన్ కమిటి సభ్యులు సామ. శ్రీనివాస రెడ్డి గారు,కోట శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు*
Navigation
Post A Comment: