మన్యం టీవీ ఏటూరు నాగారం
మందకృష్ణ మాదిగ గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా కాలికి బలమైన గాయం అయింది.ఢిల్లీలోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసుకుని తిరిగి వచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో తన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.ఆయన వన దేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ అశీసులతో త్వరగా కోలుకొని సామాజిక ఉద్యమాలు ఉద్ధృతం చేయాలని కోరారు. మందకృష్ణ మాదిగ ను కలిసిన వారిలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమరం ప్రభాకర్,ఏ ఎస్ యు రాష్ట్ర అధికార ప్రతినిధి చందా మహేశ్,ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు పుట్ట రవి మాదిగ లు పరామర్శించారు.
Post A Comment: