👉 గూడు చెదిరిన కుటుంబానికి ఆర్థిక చేయూత..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జూలూరుపాడు మండలం లోని పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలో గల బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన ఆదివాసి తెల్లం కోటేశ్వరరావు కుటుంబం నివాసముంటున్న ఇల్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. నిరంతరంగా రెండు, మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు కుటుంబ సభ్యులతో నానా అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న కొమరం భీం పౌండేషన్ సభ్యులు విరాళాలు సేకరించి శనివారం బచ్చల కోయగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 22 వేల రూపాయలను తెల్లం కోటేశ్వరరావు కుటుంబానికి కొమురం భీం పౌండేషన్ తరఫున అందజేశారు.
Post A Comment: