భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) శనివారం నాడు యంగ్ ఇండియన్ బ్లడ్ డొనార్స్ క్లబ్ కొత్తగూడెం వారీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 50 మంది ఉపాధ్యాయులను ఘనంగ సన్మనించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురువులు సమాజ నిర్మాతలని దేశ భవిష్యత్తు వారీ పైన వున్నదని అన్నారు. గురువులు తల్లిదండ్రులు తో సమానమని విద్యార్థులను తీర్చి దిద్దడం లో గురువుల పాత్ర అమొఘమన్నరు..
విశిష్ఠ అతిథిగా మునిసిపల్ చైర్మన్ కాపు సీతా లక్ష్మి మాట్లడుతూ తాను కూడ ఒక టీచర్ గా పనిచేశానని సమాజంలో గురువుల స్థానం మరెవ్వరికీ ఉండదన్నారు.
ఈ ఈ కార్యక్రమానికి క్లబ్ ముఖ్య సలహాదారుడు షేక్ దస్తగిరి అధ్యక్షత వహించగా
క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ బాలు, ప్రధాన కార్యదర్శి గుండపునేని సతీశ్, గౌరవ అధ్యక్షులు లగడపాటి రమేష్, లతో పాటు పరీక్షల కమీషనర్ రామేశ్వర రాజు, మధుర వాణి.. మునిసిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిల్ర్స్ ప్రసాద్, వనిత, కూసపటి శ్రీనివాస్, లక్ష్మణ, నాయక్,PRTU డివి, మన్నా,రాము,
సుజాత,MEO జుంకిలల్ పాల్గోన్నారు.
Post A Comment: