CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కామందుడు రాజుని ఎన్ కౌంటర్ చేసి బాధిత కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చి ఆదుకోవాలి - కాంగ్రెస్ మహిళా నాయకుల డిమాండ్

Share it:

 



 మన్యంటీవి, దమ్మపేట:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మందలపల్లి క్రాస్ రోడ్డు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దమ్మపేట మండలం మహిళా కాంగ్రెస్ కమిటీ తరుపున పొదిలి జ్యోతి జిల్లా మహిళ కాంగ్రెస్ నాయకురాలు అధ్యక్షతన, సున్నం నాగమణి జడ్పిటిసి ములకలపల్లి టిపిసిసి మెంబర్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా కాంగ్రేస్ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. సున్నం నాగమణి, దేవి ప్రసన్న, పొదిలి జ్యోతి లు మాట్లాడుతూ గిరిజన చిన్నారి తల్లి చైత్ర పై హత్యాచారం చేసి, హత్య చేయటం జిల్లా కాంగ్రెస్, మండల కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కామాందుడు రాజును ఎన్ కౌంటర్ చేసి బాధిత కుటుంబాన్ని 50 లక్షలు ఇచ్చి  ఆదుకోవాలని కాంగ్రేస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నిందితున్ని ఈరోజు వరకు అరెస్టు చేయకపోవటం టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం, టిఆర్ఎస్ ప్రభుత్వానికి గిరిజనులు కనబడటం లేదా, సైదాబాదు లో హత్యాచారం హత్య కు గురైన ఆరేళ్ళ చిన్నారి కేసు దిశ కేసులో తీసుకున్న నిర్ణయం ఎందుకు  తీసుకోవటం లేదని టిఆర్ఎస్ ప్రభుత్వాని సున్నం నాగమణి డిమాండ్ చేసారు. గిరిజన బాలిక అమానుషం గా హత్యాచారానికి, హత్యకు గురైతే బాదితకుటుంబాన్ని పరమర్శిoచేoత  మానవత్వం కూడ టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండ పోయిందని సున్నం నాగమణి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వాలి కొత్తగూడెం టౌన్ మహిళ కాంగ్రేస్ ప్రెసిడెంట్, ఎసుమణి, మరియమ్మ, పద్మపుడి సత్యవతి, చిప్పల యశోద, లక్ష్మి నియోజకవర్గ మహిళ కాంగ్రేస్  నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: