మన్యం టివి ;ములకలపల్లి మండలం; రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన పేదలకు ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ దరఖాస్తు ల గడువు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండలకార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మండలంలోని మారుమూల గ్రామాలనుండి మీసేవ కేంద్రాలవద్ద పడిగాపులు కాస్తున్న సర్వర్ పనిచేయక ,కరెంటు సమస్యతో ఆన్ లైన్ కాక మండల వ్యాప్తంగా అనేకమంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని,ప్రభుత్వం ప్రకటించిన ఆగస్టు 31ను పెంచి సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచాలని, డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నిమ్మల మదు, రావుజా, లక్మినర్సయ్య జగ్గు, అంజలి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: