పదిహేను నేలలు తర్వాత మోగిన బడి గంట.
మన్యం టీవీ కరకగూడెం: కరోనా మహమ్మారి మూలంగా హత పదిహేను నేలలు నుండి మూత పడిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను పునః ప్రారంబించాడనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఉపాద్యాయులు, ఉపాధ్యాయ రాలు, అంగన్వాడీ టీచర్ లు ప్రారంబించారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని 36 శాతం విద్యార్థులు హాజరు అయినట్లు విద్యా శాఖ అధికారి వీరస్వామి తెలిపారు. పాఠశాలలు ప్రారంభం సందర్భంగా కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా పలు పాఠశాల లను సందర్శించి అక్కడ సమస్యలను ,విద్యార్థులను,ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం అమె మాట్లాడుతూ కోవిడ్ కారణంగా మూతపడిన పాఠశాలలు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం మరల పాఠశాలలు ప్రారంభించడం అభినందంగా ఉందన్నారు. అలాగె ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తిసుకోవాలని అమె తెలిపారు. విద్యార్థులు మాస్క్ లు ధరించి పాఠశాలకు హాజరయ్యే ల తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పంచాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ శ్రీనివాస్ ఉపాద్యాయులు, అర్ఐ తోలెం బాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య రామలింగం శ్రీనువాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: