చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం పునః ప్రారంభమైనాయి.విద్యార్థులకు జ్వరం పరీక్ష చేసి, మాస్కులు ఉంటేనే అనుమతించారు. మండలంలో 2323 మంది గాను 720 మంది పాఠశాలకు హాజరయ్యారు. బెండాలపాడు ప్రభుత్వ పాఠశాలకు మండల ప్రత్యేక అధికారి సంజీవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు సందర్శించి, సంతృప్తి చెందారు.మధ్యాహ్న భోజనం సందర్శించి, విద్యార్థులకు వడ్డించారు.మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తల్లిదండ్రులు నిర్భయంగా తమ పిల్లలను పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ వో సత్యనారాయణ, ఎంపీడీవో అన్నపూర్ణ, ఈ ఆర్ డి ఓ తోట తులసి రామ్, పంచాయతీ సెక్రెటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: