CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మోగిన బడిగంట

Share it:

 


👉 ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు

👉పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం: ఎంపిపి రేగా కాళిక ,ఎంపీడీవో శ్రీను

మన్యం టీవి:

కరోనా మహమ్మారి మూలంగా 16 నెలల అనంతరం కరకగూడెం మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడి గంట మోగింది. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు కరోనా నియమావళి పాటిస్తూ తరగతులు నిర్వహించారు. కరకగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ రేగా కాళిక విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 16 నెలలుగా పాఠశాలలు తెరవకపోవడం మూలంగా విద్యార్థుల మానసిక స్థితిపై ప్రభావం ఏర్పడే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై పక్క పర్యవేక్షణ ఉండాలని ఆమె సూచించారు. తరగతులకు హాజరైన విద్యార్థులు లు కరోనాఅనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లో ఎం పీ డీ వో శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: