CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన చుంచుపల్లి పోలీసులు

Share it:


👉వివరాలను వెల్లడించిన సిఐ గురుస్వామి

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) శనివారం నాడు తెల్లవారుజామున సుమారుగా 3.30 గంటల సమయంలో చుంచుపల్లి ఎస్సై బి.మహేష్ తన సిబ్బందితో కలిసి పోలీసు స్టేషన్ పరిధిలోని విద్యా నగర్ కాలనీ గ్యాస్ గోదాము ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పర్నండి శ్రీకాంత్ S/o.రాజేందర్,

గాజులరాజాం బస్తి,కొత్తగూడెం అను వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుచుండగా అదుపులోకి తీసుకొని విచారించగా చెడు అలవాట్లకు బానిసై,నిత్యం మద్యం సేవిస్తూ, ఏ పని చెయ్యకుండా ,దొంగతనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నాడని తేలింది.అందులో భాగంగానే అతను ఈ సంవత్సరం జూన్ మాసం చివరి వారంలో రాత్రి 10 గంటల సమయంలో రాంనగర్ మెయిన్ రోడ్డులో ఉన్న "క్రాంతి బోటిక్ & లేడీస్ టైలర్స్"దుకాణంలోకి వెనుక నుండి ప్రవేశించి వెనుక గదిలో ఉన్న సెల్ఫ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగును దొంగిలించాడు. అందులో ఉన్న 50,000/-ల రూపాయల నగదును,ఒక బంగారు గొలుసు,05 బంగారు ఉంగరాలను, బంగారు పుస్తెలను,04 బంగారు గుండ్లను మరియు ATM కార్డులను,బ్యాంక్ బుక్కులను,ఆధార్ కార్డ్,పాన్ కార్డ్ మరియు ఇతర క్రెడిట్ కార్డులను,ఒక మోటార్ బైకు తాళపు చెవిని దొంగిలించినట్లు తెలిసింది. బ్యాగులో ఉన్న 50 వేల రూపాయలు నగదును తన అవసరాలకు వాడుకుని,బంగారు వస్తువులను ఇంట్లో దాచుకుని,మిగిలిన వస్తువులను,హ్యాండ్ బ్యాగును మురికి కాలువలో పడవేసినానని నిందితుడు అంగీకరించడం జరిగిందని చుంచుపల్లి సిఐ గురుస్వామి తెలిపారు.అతని వద్ద నుండి సుమారుగా 05 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం ముద్దాయిని జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుందని తెలిపారు.

Share it:

Post A Comment: