మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఇల్లందు మండలం బాలాజీ నగర్ చెందిన మిడియం దుర్గయ్య ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రకటన తెలిపిన ఫౌండర్ &అండ్ ప్రెసిడెంట్ మంగళపల్లి హుస్సేన్, ఈ సందర్భంగా మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను విద్యా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని వారికి అందుబాటులో ఉండాలని పిలుపునివ్వడం జరిగింది, ఈ సందర్భంగా మిడియం దుర్గయ్య మాట్లాడుతూ..నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది, తప్పకుండా నా విధి నిర్వహణను కర్తవ్యంగా నడిచి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Post A Comment: