మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణియులందరి రక్షణార్థం,లోక కళ్యాణార్థం మణుగూరు ఏరియా కొండాపురం భూగర్భ గని నందు వినాయక చవితి పర్వదిన వేడుకలను గని కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వినాయక విగ్రహాన్ని గని సి- రిలే కార్మికుల సారధ్యంలో అందచేయగా,మిగతా ఏర్పాట్లు ముందుకు సాగడానికి గని కార్మికులు సమిష్టిగా విరాళాలు అందచేసి వినాయకుడిని ప్రతిష్టపన చేయడం జరిగింది.5 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మైన్ ప్రాంగణంలో పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Post A Comment: