CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు మరమ్మతులు చేయించండి

Share it:

 


*తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం లో క్రాస్ రోడ్డు నుండి కోమటిపల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మించాలని కోరుతూ శనివారం ఐటిడిఎ ఏపీవో వసంతరావు కు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు అనంతరం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజక వర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్వగ్రామం అవ్వడం వలన రోడ్డు మరమ్మతులు చేయడానికి అధికార ప్రభుత్వం విముఖత చేస్తుందని కావాలనే దురుద్దేశంతోనే రోడ్డు మరమ్మతులు చేయకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడి అత్యవసర వాహనాలు రావటానికి ఇబ్బందికరంగా ఉందని అన్నారు.ఐటిడిఎ ఏటూరు నాగారం వారు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని అన్నారు.అలాగే ఊరి పైన ఉన్న చెరువు నీళ్ళు రోడ్లపైకి వచ్చి ఆ ప్రాంతంలో ఆటోలు,ట్రాక్టర్లు,బండ్లు దిగ బడడం జరుగుతుందని ఆ నీళ్లు రోడ్డు పైకి రాకుండా పక్కకు మళ్ళించాలని అని అన్నారు.మంగపేట మండలం లో ప్రజా ప్రతినిధుల పాలన లేకపోవడం వలన అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బగట్ల సుమన్,ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: