మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపుతో జూలూరుపాడు మండలం లోనీ గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం ఘనంగా జెండా పండుగ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరు మధుసూదన్ రావు, ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహారావు, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే లతీఫ్, సీనియర్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గూగులోతు రాంబాబు, ధర్మ, రంగారావు, పుల్లారావు, నాగేశ్వరరావు, నాగరాజు, రామకృష్ణ, రాందాస్, కనకయ్య, మైబు, చంటి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: