CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రీ సత్యసాయి చెవిటి మూగ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Share it:



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సంతోష్ నగర్ లోని శ్రీ సత్యసాయి చెవిటి మూగ పాఠశాలలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థిని,విద్యార్థులు,ఉపాధ్యాయులుగా ముస్తాబై ఇతర విద్యార్థి విద్యార్థులకు కొద్దిసేపు వారి విద్యా విధానంలో భాగమైన *స్పీచ్ థెరపీ *సైగల ద్వారా, పెదవుల కదలిక* భాషలో కొద్దిసేపు బోధించారు. ఉపాధ్యాయ దుస్తుల్లో తనను తాను చూసుకుంటూ ఎదుటివారిని మెచ్చుకుంటూ సంతోషంగా గడిపారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీ రోజా స్పీచ్ తెరఫీ లో విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేకతను వివరించారు. తత్వ సాయుథుడు, భారతీయ ప్రతిష్ట ప్రపంచానికి చాటి చెప్పిన తత్వవేత్త,అసాధారణ ప్రజ్ఞాశాలి మన తెలుగు తేజం *సర్వేపల్లి రాధాకృష్ణన్* పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న మని ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థిని,విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.పాఠశాల కరస్పాండెంట్ తణుకు. నాగమణి,ప్రసాద్ దంపతుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ, దివ్యశ్రీ,చుర్షిక,సాత్విక్,సాయి కిరణ్,జశ్వంత్,సాయి భార్గవ్,హేమంత్,రాధిక తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: