(మన్యం టీవీ) డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎల్ఐసి) సెప్టెంబర్ 2021 నాటికి అరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు కొత్తగూడెం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాజు, అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ఎల్ఐసి ఏజెంట్ లతో కలసి వాకర్స్ కు ఎల్ఐసి పాలసీల గురించి వారికి వివరించారు. దానితోపాటు పాంప్లెంట్ లను పంచుతూ ఇన్సూరెన్స్ పై ప్రజలను చైతన్య పరిచారు. ప్రపంచంలోనే నెంబర్వన్ ఇన్సూరెన్స్ సంస్థగా ఎల్ఐసి నిలిచిందన్నారు. 99.9 శాతం క్లైమ్ సెటిల్మెంట్లు చేస్తున్న ఏకైక సంస్థ ఎల్ఐసి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజారావు, ఏజెంట్లు దారా రమేష్ , గోపి కృష్ణ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: