మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల తహశీల్దార్ కార్యాలయం నందు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 21 మంది లబ్ధిదారులకు 21లక్ష 2 వేల 436 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు వివాహ ఖర్చుల నిమిత్తం ఒక లక్షా పదహారు రూపాయలు అందజేసి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎమ్మార్వో లూధర్ విల్సన్, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపిపి సోనీ, జడ్పిటిసి కళావతి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చౌడం నరసింహారావు, సీనియర్ నాయకులు వీరభద్రం, ఎంపీటీసీలు రాజశేఖర్, మధుసూదన్ రావు, సతీష్, సర్పంచులు, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: