విద్య తో విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉంది
ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలి
సమీక్ష సమావేశంలో ఎంపిపి మంజుభార్గవి
గుండాల/ఆళ్ల పల్లి సెప్టెంబర్ 17 (మన్యం మనుగడ) విద్యతోనే విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉందని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ. విద్యార్థుల భవిష్యత్ చదువుతో ముడిపడి ఉన్నందున ఉపాధ్యాయులు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా విద్య , వైద్యం చాలా సున్నితమైన అంశాలు అన్నారు. విద్య ప్రాథమిక దశలో విద్యార్థికి అందకపోతే విద్యార్థి భవిష్యత్తు చెడిపోతుందని అలాగే సకాలంలో వైద్యం అందకపోతే కూడా మనిషి ప్రాణాలు నిలువు అన్నారు. అందుచేత బాధ్యతగల వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు కానీ వైద్య సిబ్బంది కానీ తమ తమ విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కృష్ణయ్య , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: