మన్యం టీవీ,బూర్గంపాడు:
నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కౌలూరు.అంజు గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతుంది.ఈ విషయమై స్థానిక ఉపసర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఆమె హైదరాబాదులో వైద్యం నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రవాణా ఖర్చుల నిమిత్తం ఐటిసి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్ దృష్టికి ఝాన్సీ లక్ష్మి తీసుకెళ్లగా మానవతా దృక్పథంతో ఆయన 5000 ఆర్థిక సహాయం అందించారు.అలాగే ఇంకొక ఐటీసీ కాంట్రాక్టర్ జలగం చంద్రశేఖర్ తన వంతు సాయంగా రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కాగా కౌలూరు.అంజు కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం రవాణా ఖర్చుల నిమిత్తం పూర్తి సహాయ సహకారాలు అందించిన నాగినేని ప్రోలు రెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ లక్ష్మి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: