మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:: అశ్వారావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో అనాధ శవం. వివరాల్లోకి వెళ్ళితే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, చివరకు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వారావుపేట ఆర్టీసి బస్టాండ్ ఆవరణంలో వర్షానికి తడిచి,చలికి తట్టుకోలేక బిగుసుకుపోయి బల్లపై మృతి చెందాడు ఓ యాచకుడు. అశ్వారావుపేట ఆర్టీసీ సిబ్బంది మంగళవారం ఉదయం బల్ల పై ఉన్న శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, గ్రామ పంచాయతీ ఈవో హరికృష్ణ, రెవెన్యూ అధికారులు ఏఎస్ఐ సత్యనారాయణ, మృతదేహానికి పంచనామా నిర్వహించి పవన్ కళ్యాణ్ సేవా సమితి వారికి తెలియపరచగా వారు దహన సంస్కారాలు నిర్వహించారు.ఈ దహనసంస్కారాలలో పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు-డేగల రామచంద్ర రావు, సభ్యులు-కంభంపాటి భాస్కర్, చిట్టితల్లి అంబులెన్స్ డ్రైవర్-బాజీ, గుర్రాల సాయి, రాము, చందూ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: