మన్యం టీవీ మంగపేట. -
భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిజాం రాజకార్ల రాచరిక పాలన నుండి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 సందర్భంగా పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు సెప్టెంబర్17 విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికి తెలంగాణలో మాత్రం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూన్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సెప్టెంబరు 17 రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మండల అధ్యక్షులు ఎర్రంగాని వీరన్ కుమార్ ఆధ్వర్యంలో మంగపేట మండల తహశీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్ పాషా,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా,దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతేనపల్లి నరేందర్ ,దళిత మోర్చా జిల్లాకార్యవర్గ సభ్యులు బొల్లే శ్యాముల్,మండల సీనియర్ నాయకులు మురార్జీ,యువ మోర్చా నాయకులు జవంగుల రవి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: