మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట వాటర్ ట్యాంక్ వీధిలో గణేష్ నవరాత్రులు సందర్బంగా అన్నదానం కార్యక్రమం సి ఐ సట్ల కిరణ్ కుమార్ మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా సి ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ పండుగ వాతావరణం లో ప్రతి ఒక్కరూ గణేష్ మండపాల నిర్వాహకులు నియమనిబందనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని ఇలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు ఈయకూడదని గణేష్ నిమజ్జనం కూడా పోలీస్ వారు కేటాయించిన ప్రదేశాలలో నిమజ్జనం చేయాలనీ రహదారులపై ఎవరికీ ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని ఈ సందర్బంగా మండపాల నిర్వాహకులకు తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమం లో దాతలు అనంతుల జ్యోతి, రవిగుప్తా, ముక్కెర తిరుమల శ్రీనివాస్గౌడ్ వాటర్ ట్యాంక్ యూత్ భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: