మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం (సెప్టెంబర్-16)::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురీశెట్టి (ఐఏఎస్) ఆకస్మిక పర్యటన చేశారు.మండలంలోని నారంవారిగూడెం కాలనీ,గుమ్మడివల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య శాలలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అశ్వారావుపేట మండలంలోని అన్ని సబ్ సెంటర్ వద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా నిర్వహిస్తున్నారని, 18 ఏళ్లు దాటిన వారి అందరకీ తప్పకుండా వ్యాక్సిన్ వేపించాలని, అధికారులు అందరూ, ప్రజా ప్రతినిధిల సహకారంతో ఇంకా త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆయన అన్నారు.మండల టీం వ్యాక్సినేషన్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనటంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేసి,అశ్వారావుపేట తహశీల్దార్ చల్లా ప్రసాద్ ను ప్రశంసించారు. వారం రోజుల్లో 100% టీకాలు పూర్తిచేసి కేక్ కటింగ్ కు తనను ఆహ్వానించాలని తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మీ, ఆర్డిఓ- స్వర్ణలత, ఎంపీడీవో- విద్యాధర రావు, ఈవోఆర్డి-సీతారామరాజు, ఈజీఎస్ ఏపీఓ-శ్రీనివాసరావు, ఎంఆర్ఐ-వెంకటేశ్వర్లు,సర్పంచ్-రాధ, గ్రామపంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: