మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి (సెప్టెంబర్-16):: ప్రపంచ నాయిబ్రాహ్మణల దినోత్సవం సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం,యర్రగుంట గ్రామంలోని ప్రధాన సెంటర్ లో నాయుబ్రహ్మణలు సంఘం రాష్ట్ర నాయకులు మంతెన రాఘవులు ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ మంగలి వృత్తినే నమ్ముకొని తరరాలుగా తాము బ్రతుకుతున్నామని,నాయిబ్రాహ్మణుల మైన మాకు, ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాని కోరారు.ఈ కార్యక్రమంలో నాయిబ్రాహ్మణుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు దడిగల మల్లేష్,కడిమల సత్యనారాయణ, నాయిబ్రాహ్మణుల సంఘం అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు టి భూపతిరావు, నాయిబ్రాహ్మణుల సంఘం అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జే శివ, నాగరాజు, జంపాల రవి కుమార్, శ్రీను, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: